

దేశంలో అత్యంత విలువైన సంస్థగా గుర్తింపు పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన డిజిటల్ మరియు టెలికాం సేవల విభాగమైన జియో ప్లాట్ఫామ్స్ కోసం ఐపీఓ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు సమర్పించనున్నట్లు సమాచారం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా స్టాక్ మార్కెట్లు పడిపోవడంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ వాయిదా పడినప్పటికీ ఇప్పుడు సంస్థ మళ్లీ వేగం పెంచింది.
ఈ ఐపీఓ నిర్వహణ కోసం 17 మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలను నియమించగా అంతర్జాతీయ స్థాయి సంస్థలు కూడా ఇందులో భాగమయ్యాయి. జియో ప్లాట్ఫామ్స్ సుమారు 2.5 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉంది. సంస్థ మార్కెట్ విలువను భారీ స్థాయిలో అంచనా వేస్తుండగా ఈ ఐపీఓ ద్వారా సుమారు 40 వేల కోట్ల రూపాయలు సమీకరించే అవకాశం ఉంది. ఇది భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశముంది.



.jpeg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!