
న్యూస్

దేశంలో ప్రైవేట్ బస్సుల్లో అగ్నిప్రమాదాలు ఆగడం లేదు. కర్నూలు ఘటన షాక్ నుంచి తేరుకోకముందే, రాజస్థాన్లోని జైపూర్–ఢిల్లీ రహదారిపై మరో బస్సు దగ్ధమై, ముగ్గురు ప్రయాణికులు సజీవదహనం కాగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు ప్రయాణంలో ఉండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఇటీవల జైసల్మేర్లో 26 మంది, అలాగే రెండురోజుల క్రితం కర్నూలులో 19 మంది ప్రైవేట్ బస్సు మంటల్లో మృతి చెందిన ఘటనలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.











కామెంట్స్ (1)
ప్రజల భద్రత కోసం తక్షణమే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి