
జనరల్

షాదీ డాట్కామ్ వ్యవస్థాపకుడు, షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జి అనుపమ్ మిట్టల్ భారత కార్పొరేట్ రంగానికి సంబంధించిన ఆసక్తికరమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. కంపెనీలు నెలకు ఒకసారి కాకుండా రెండు సార్లు జీతాలు చెల్లించే విధానాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు. ప్రతి నెల 15వ తేదీ, 30వ తేదీన జీతం చెల్లిస్తే ఉద్యోగులు తమ ఖర్చులను మెరుగ్గా నిర్వహించుకోగలరని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ విధానం వల్ల మధ్య నెలలో ఎదురయ్యే ఆర్థిక ఒత్తిడి తగ్గడంతో పాటు కుటుంబ ఖర్చుల ప్రణాళిక సులభమవుతుందని అనుపమ్ మిట్టల్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఉద్యోగుల చేతిలో తరచుగా డబ్బు ఉండటం వల్ల వినియోగ వ్యయం పెరిగి ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదన ఉద్యోగుల ఆర్థిక సంక్షేమం, ఆధునిక కార్యాలయ విధానాలపై కొత్త చర్చకు దారితీసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!