

డీఎస్సీ నియామకాలలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న అభ్యర్థులకు పూర్తి స్థాయిలో న్యాయ సహాయం అందిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. బాధిత అభ్యర్థుల న్యాయ పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని, కోర్టు కేసులకు సంబంధించిన ఖర్చులన్నింటినీ భరిస్తామని హామీ ఇచ్చారు. డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇప్పటికే సీబీఐ విచారణను డిమాండ్ చేసినట్లు తెలిపారు.
స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ప్రస్తావించిన జగన్, పారదర్శకతపై అనేక సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత సాధించిన కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోవడం, వెరిఫికేషన్ ప్రక్రియపై వివాదాలు తలెత్తడం వంటి అంశాలను ప్రశ్నించారు. డీఎస్సీ లీకులు, నియామకాల్లో అవకతవకలు, అభ్యర్థుల ఫిర్యాదులకు సరైన సమాధానాలు లేకపోవడం ఆందోళనకరమని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై రీ-ఎంక్వైరీతో పాటు ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!