
జనరల్

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో గ్రామసభల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసినట్లు ఎంపీడీవో మల్సూర్ నాయక్ తెలిపారు. ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో ఆయా గ్రామపంచాయతీల పరిధిలో గ్రామసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
గ్రామసభల ద్వారా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించడంతో పాటు ప్రజల సమస్యలు, అవసరాలు, సూచనలను స్వీకరించనున్నట్లు తెలిపారు. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!