
టెక్నాలజీ

ఏళ్లుగా ఆస్తి పన్ను బకాయిలతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ ప్రజలకు ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను బకాయిల పై ‘వన్ టైమ్ స్కీమ్’ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు తాజాగా G.O.Rt. No. 869 ను విడుదల చేసింది. ఈ స్కీమ్ ప్రకారం పాత ఆస్తి పన్ను బకాయిల పై ఉన్న వడ్డీలో 90 శాతం వరకు మాఫీ ఇవ్వనున్నారు. బకాయిల్లో మిగిలిన అసలు మొత్తంతో పాటు కేవలం 10 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది.
ఈ వెసులుబాటు హైదరాబాద్ నగరవాసులకు మాత్రమే వర్తిస్తుందని GHMC స్పష్టం చేసింది. అలాగే 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిల పై, ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలన్నింటికీ ఈ స్కీమ్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కావున, ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆస్తి పన్ను బకాయిలను త్వరగా చెల్లించాలని అధికారులు సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!