

మల్కాజ్గిరి ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ను కించపరిచే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలను తెలంగాణ బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం ఒక నాయకుడిపై వ్యక్తిగత దాడి మాత్రమే కాదని, రాష్ట్రంలో బీజేపీ పెరుగుతున్న ప్రభావాన్ని చూసి భయపడుతున్న ప్రత్యర్థి రాజకీయ శక్తుల అసహనానికి నిదర్శనమని పార్టీ నేతలు పేర్కొన్నారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఈటల రాజేందర్ ప్రజా జీవితంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాయకుడని బీజేపీ పేర్కొంది. అలాంటి నాయకుడి ప్రతిష్ఠను దెబ్బతీయడానికి చేసే ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపింది. ఈ ఘటన వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థలు లేదా రాజకీయ శక్తులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ బీజేపీ పూర్తిగా ఐక్యంగా ఉందని, ఇలాంటి కుట్రలు పార్టీ ఐక్యతను ఏమాత్రం ప్రభావితం చేయలేవని స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!