

టీమిండియాలో గాయాల సమస్య పెరుగుతున్న నేపథ్యంలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరుపై వస్తున్న విమర్శలకు ఆ సంస్థ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించారు. ఆదివారం బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సీఓఈని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కేవలం పునరావాస కేంద్రంగా మాత్రమే చూడకూడదని అన్నారు. క్రికెటర్లు అత్యుత్తమంగా రాణించేలా సహాయపడటం కూడా తమ బాధ్యతల్లో భాగమని స్పష్టం చేశారు.
ఆటగాళ్ల కెరీర్లో గాయాలు సహజమేనని, ఇందుకు ఏ ఒక్క వ్యక్తిని లేదా విభాగాన్ని బాధ్యుడిగా చేయడం సరికాదని లక్ష్మణ్ పేర్కొన్నారు. సీఓఈ, టీమ్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ సిబ్బంది, సెలక్షన్ కమిటీ మధ్య నిరంతర సమన్వయం ఉందని, ఆటగాళ్ల ఫిట్నెస్పై ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయని తెలిపారు. శ్రీలంక టెస్టు సిరీస్ కోసం బుమ్రా, సాయి సుదర్శన్ను ఫిట్నెస్ సాధిస్తారనే అంచనాతో ఎంపిక చేసినప్పటికీ, మోకాలిలో నీరు చేరడంతో బుమ్రా, కాలి వేలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో సాయి సుదర్శన్ సిరీస్కు దూరమయ్యారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!