
న్యూస్

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తును వేగవంతం చేసింది. దర్యాప్తులో భాగంగా జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించింది. హంద్వారాలోని ఒక వ్యాపారి నివాసంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఈ కేసులో అరెస్టైన నిందితులకు ఆయుధాలు సరఫరా చేసిన వ్యక్తులతో ఆ వ్యాపారికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సోదాల్లో కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల ప్రారంభంలో పుల్వామా, కుల్గాం, షోపియన్, బారాముల్లా, కుప్వారా జిల్లాల్లో కూడా సోదాలు నిర్వహించారు. అలాగే సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి ఆయుధాలు సరఫరా చేసిన మరో ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 11కి చేరింది.














.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!