
ఓటిటి

హరియాణా రాష్ట్రంలోని ఫరిదాబాద్లో ఉన్న అల్-ఫలాహ్ యూనివర్సిటీలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ యూనివర్సిటీకి చెందిన ఆసుపత్రిలో 40 శాతం మంది డాక్టర్లు నకిలీవారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు వైద్య విద్యా అర్హతలు లేకుండా రోగులకు చికిత్స అందిస్తున్న వ్యక్తులు డాక్టర్లుగా పనిచేస్తున్నారని తెలుస్తోంది.
ఈ ఘటనపై అధికారుల దర్యాప్తు ప్రారంభమైంది. యూనివర్సిటీ మేనేజ్మెంట్తో సంబంధం ఉన్న కొంతమంది నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఇప్పటికే కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు నెట్వర్క్ను బయటపెట్టేందుకు విచారణ కొనసాగుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!