
గాసిప్స్

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై చర్చించేందుకు ఉక్రెయిన్ ప్రతినిధులు త్వరలో వాషింగ్టన్ వెళ్లనున్నట్లు అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు.
అమెరికా ఇటీవల యుద్ధం నిలిపివేయడానికి 28 పాయింట్లతో కూడిన పీస్ ప్లాన్ను ఇరు దేశాలకు పంపిన విషయం తెలిసిందే. అయితే, ఆ ప్రణాళికలోని కొన్ని అంశాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో అమెరికా వైఖరిలో కొంత మార్పు వచ్చినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
యుద్ధం ముగింపుకు దారితీసే ఈ చర్చలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!