
గాసిప్స్

రాజస్థాన్లో ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు, శ్రీగంగానగర్, బికనీర్, సీకర్ వంటి ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భీకర గాలులతో పాటు దట్టమైన ఇసుక మేఘాలు ఆవరించడంతో చీకట్లు కమ్ముకున్నాయి. అనంతరం ఆయా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇసుక తుపాను కారణంగా వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇంతకుముందు జైపుర్లో కూడా ఇదే తరహా వాతావరణం కనిపించింది. ధోల్పుర్ జిల్లాలో అత్యధికంగా 5.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. గంటకు 60–70 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే నాలుగు నుంచి ఐదు రోజులు ఈ తరహా వాతావరణం కొనసాగవచ్చని తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!