

టీ20 క్రికెట్లో బ్యాటర్లు, బౌలర్ల మధ్య సమతుల్యత దెబ్బతింటోందని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, 200కు పైగా స్కోర్లు సాధారణంగా మారిపోతున్న నేపథ్యంలో బౌలర్లకు అవకాశాలు తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు. ఆటను మరింత ఉత్కంఠభరితంగా, పోటీతో కూడినదిగా మార్చేందుకు మూడు కీలక మార్పులను ప్రతిపాదించారు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను తొలగించాలని, ఆరు ఓవర్ల పవర్ప్లేను రెండు భాగాలుగా విభజించి చివరి రెండు ఓవర్ల వినియోగంపై ఫీల్డింగ్ జట్టు కెప్టెన్కు నిర్ణయాధికారం ఇవ్వాలని సచిన్ సూచించారు. అలాగే ఒక జట్టులోని అత్యుత్తమ బౌలర్కు ఐదో ఓవర్ వేసే అవకాశం కల్పించాలని ప్రతిపాదించారు. ఈ మార్పులు అమలైతే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల మధ్య సమతుల్యత పెరిగి టీ20 క్రికెట్ మరింత ఆసక్తికరంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!