

మోహన్లాల్ ప్రధాన పాత్రలో, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. ‘దృశ్యం’ సిరీస్కు కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, ద్వితీయార్ధంలోని ఉత్కంఠభరితమైన కథనం, క్లైమాక్స్లోని ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా వసూళ్ల పరంగా మంచి ఫలితాలను నమోదు చేస్తోంది.
ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం, ‘దృశ్యం 3’ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. భారత్లో కూడా రూ.100 కోట్ల మార్క్ను దాటినట్లు సమాచారం. ఈ విజయంతో ‘దృశ్యం 4’పై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. గతంలో మోహన్లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ భవిష్యత్తులో మరిన్ని సీక్వెల్స్ వచ్చే అవకాశాన్ని ప్రస్తావించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!