జనరల్

ఏపీ ప్రభుత్వం వచ్చే నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను విడుదల చేసింది. మొత్తం రూ. 2,728 కోట్లను పెన్షన్ చెల్లింపుల కోసం కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 62,34,445 మంది లబ్ధిదారులకు ఈ నెల పెన్షన్లు అందనున్నాయి.
కొత్తగా 5,606 స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేయగా, వీటి కోసం ప్రత్యేకంగా రూ. 2.24 కోట్లు విడుదల చేశారు. వచ్చే నెల 1 వ తేదీ సోమవారం ఉదయం నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతుంది. ప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీనే పెన్షన్లు అందజేస్తోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పెన్షన్ల కోసం రూ. 65,886.57 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. లబ్ధిదారులకు నిరంతరంగా సకాలంలో పెన్షన్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగుతోందని పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!