
గాసిప్స్

ఎండల తీవ్రత దృష్ట్యా ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉదయం పూట నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్లో జరిగే కార్యక్రమాలను ఉదయం 8.30 గంటలకు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
జాతీయ పతాకావిష్కరణతో పాటు అవతరణ ఉత్సవ కార్యక్రమాలను గంటన్నర వ్యవధిలో పూర్తి చేయాలని సీఎం తెలిపారు. ఎండ తీవ్రత కారణంగా అతిథులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!