

విప్రో రూ.15,000 కోట్ల విలువైన భారీ షేర్ బైబ్యాక్ను ప్రకటించింది. కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద బైబ్యాక్గా ఇది నిలిచింది. బోర్డు ఆమోదంతో రూ.250 చొప్పున 60 కోట్ల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది, ఇది మొత్తం ఈక్విటీ షేర్ క్యాపిటల్లో 5.7%కు సమానం. బీఎస్ఈలో ముగింపు ధర రూ.210.20తో పోలిస్తే ఇది సుమారు 18% ఎక్కువ. షేర్హోల్డర్ల అనుమతి అనంతరం 2026–27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. సీఎఫ్ఓ అపర్ణ అయ్యర్ వివరాల ప్రకారం ప్రమోటర్లు కూడా ఈ బైబ్యాక్లో పాల్గొననున్నారు. అదేవిధంగా విప్రో హైడ్రాలిక్స్ ఇటలీకి చెందిన ఇండెకో ఇండ్ స్పాలో మెజారిటీ వాటా కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
ఆర్థిక ఫలితాల విషయానికి వస్తే, 2025-26 జనవరి–మార్చి త్రైమాసికంలో విప్రో రూ.3,501.8 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది, ఇది గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. అయితే ఆదాయం 7.6% పెరిగి రూ.24,236.3 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన లాభం 12.2%, ఆదాయం 2.8% పెరిగాయి. పూర్తి ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.13,197.4 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం రూ.92,624 కోట్లుగా నమోదైంది. ఉద్యోగుల సంఖ్య 2,42,156కి పెరిగి, ఈ ఏడాది 7,500 మంది ఫ్రెషర్లను నియమించింది. అమెరికా మార్కెట్లో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రస్తుత త్రైమాసికంలో ఐటీ సేవల ఆదాయం 2,597 నుండి 2,651 మిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!