
న్యూస్

ఇరాన్తో చర్చలు విఫలమైన నేపథ్యంలో హర్మూజ్ జలసంధిపై దిగ్బంధనం విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ చర్య ఈ రోజు నుంచి అమల్లోకి రానుందని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు) ఈ దిగ్బంధనం ప్రారంభమవుతుందని పేర్కొంది. ఇరాన్కు అక్రమంగా టోల్ చెల్లించే నౌకలను వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది.
దిగ్బంధనంలో భాగంగా ఇరాన్ ఓడరేవుల్లోకి ప్రవేశించే లేదా అక్కడి నుంచి బయలుదేరే అన్ని దేశాల నౌకలను అడ్డుకునే చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యం మరియు సముద్ర రవాణాపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
.jpg&w=3840&q=75)














.jpg&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!