
ఓటిటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. డెడ్లైన్ను పాటించకపోతే ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిల వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాలను గంటల్లోనే ధ్వంసం చేయగలమని హెచ్చరించారు. కేవలం నాలుగు గంటల్లోనే ఈ లక్ష్యాలను పూర్తిగా నాశనం చేసే సామర్థ్యం అమెరికాకు ఉందని చెప్పారు.
ఇరాన్కు బలమైన నేవీ, ఎయిర్ ఫోర్స్, రక్షణ వ్యవస్థలు లేవని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే యుద్ధ సమయంలో దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు అమెరికాకు మద్దతు ఇవ్వలేదని అన్నారు. చివరగా, ఈ యుద్ధంలో అమెరికా విజయం సాధించిందని ప్రకటిస్తూ తమ సైనిక శక్తిని మరోసారి చాటిచెప్పారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!