

నాంపల్లి ఫర్నిచర్ షోరూంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫైర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ తెలిపిన వివరాల ప్రకారం, మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అత్యవసర కాల్ అందుకున్న వెంటనే రెండు నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని ఆయన తెలిపారు. బేస్మెంట్లో ఫర్నిచర్ మెటీరియల్, రెజిన్, కెమికల్స్ నిల్వ చేయడం వల్ల మంటలు వేగంగా వ్యాపించి రక్షణ చర్యలు ఆలస్యమయ్యాయి. మెట్లు, ర్యాంప్ మార్గాలు కూడా నిల్వ పదార్థాల వల్ల మూసుకుపోవడంతో లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారు.
డీజీ విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ, బేస్మెంట్లను కేవలం పార్కింగ్ కోసం మాత్రమే ఉపయోగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గోదాములుగా వినియోగించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన భవన యజమానులు, షాప్ ఓనర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రక్షణ చర్యల్లో దాదాపు 200 మంది సిబ్బంది రాత్రంతా పాల్గొన్నారు. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ లేదా సిగరెట్ కారణం కావచ్చని తెలిపారు. భవనం నిర్మాణం బాగానే ఉన్నప్పటికీ, బేస్మెంట్ను అక్రమంగా దుర్వినియోగం చేసి ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతులు తీసుకోలేదని వెల్లడించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!