

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన సందర్భంగా రాజధాని ప్రాంతంలో రైతులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్దండరాయుని పాలెంలో జరిగిన సభలో మాట్లాడుతూ, ఈ బిల్లు ఆమోదం ప్రజాస్వామ్య గొప్పదనాన్ని, ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబించిందని తెలిపారు. ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినదిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
అమరావతి చరిత్ర శాశ్వతమని, రైతులు చేసిన త్యాగం చిరస్థాయిగా నిలుస్తుందని సీఎం అన్నారు. సుమారు 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శంకుస్థాపన జరిగిన పవిత్ర స్థలాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!