

తనకు విద్యాబోధ చేసిన గురువు, జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు మరియు విరమణ పొందిన ఉపాధ్యాయుడు డా. జైశెట్టి రమణయ్య గారి మరణంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమణయ్య గారు తనకు గురువుగానే కాకుండా అత్యంత ఆత్మీయ వ్యక్తిగా ఉన్నారని, వారి మరణం తనకు వ్యక్తిగత నష్టమని కేసీఆర్ తెలిపారు.
సిద్దిపేటలో లెక్చరర్గా పనిచేసిన సమయంలో తాను ఇంటర్మీడియట్ విద్యార్థిగా వారి వద్ద చదివిన రోజుల్ని ఆయన స్మరించుకున్నారు. 1971లో సిద్దిపేట జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో చరిత్ర ఉపాధ్యాయుడిగా సేవలందించిన రమణయ్య గారు, చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి, జగిత్యాలలో తొలి డాక్టరేట్ పొందిన పరిశోధకుడిగా గుర్తింపు పొందారు. “దక్షిణ భారత ఆలయాలు” అనే పరిశోధన గ్రంథంతో వారు డాక్టరేట్ పట్టా సాధించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!