

తెలంగాణ రాష్ట్ర రైతులకు భారీ ఊరటనిస్తూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రైతులు కిలోవాట్కు రూ.1,000 చొప్పున అవసరమైన సామర్థ్యానికి అనుగుణంగా చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. అదనపు చార్జీలు, అంచనాల పేరిట జరిగే అవకతవకలు తొలగిపోనున్నాయి. దీంతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
ఇప్పటివరకు మూడు విద్యుత్ స్తంభాలు దాటితే రూ.45 వేలకుపైగా ఔట్ రైట్ కంట్రిబ్యూషన్ చెల్లించాల్సి వచ్చేది. తాజా ఉత్తర్వులతో ఆ భారం పూర్తిగా తొలగింది. అంతేకాదు అపార్ట్మెంట్లు, నివాస సముదాయాలు, వాణిజ్య భవనాలకు కూడా కరెంటు కనెక్షన్లు సులభం కానున్నాయి. ఒక కిలోమీటర్ లోపు ఉంటే లోడు సామర్థ్యం ఆధారంగా చార్జీలు చెల్లిస్తే డిస్కమ్లు లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక కిలోమీటర్కు మించి ఉంటే ఖర్చు వినియోగదారులే భరించాల్సి ఉంటుందని టీజీఈఆర్సీ స్పష్టం చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!