
గాసిప్స్

అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. అయితే మైదానంలో విజేత ఎవరన్నది పక్కన పెడితే, వ్యాపార పరంగా ఇప్పటికే ఒక సంస్థకు భారీ ప్రయోజనం చేకూరనుందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్.
ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన బిర్లా ఎస్టేట్స్ గుజరాత్ టైటాన్స్ ప్రధాన స్పాన్సర్గా కొనసాగుతుండగా, మరోవైపు ఆర్సీబీ యాజమాన్య భాగస్వామ్య సంస్థల్లో కూడా బిర్లా గ్రూప్ భాగమై ఉంది. దీంతో ఫైనల్లో ఏ జట్టు విజయం సాధించినా బిర్లా గ్రూప్కు బ్రాండ్ గుర్తింపు, వ్యాపార ప్రచారం, మార్కెటింగ్ పరంగా భారీ లాభం దక్కుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆసక్తికర సమీకరణం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!