

మైక్రోసాఫ్ట్ కు చెందిన గిట్హబ్ కోపైలట్ కోసం కొత్త టోకెన్ ఆధారిత ధరల విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమలులో ఉన్న ఫ్లాట్ సబ్స్క్రిప్షన్ విధానానికి బదులుగా, వినియోగదారులు ఉపయోగించిన టోకెన్ల ఆధారంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నిర్ణయం ముఖ్యంగా చిన్న సంస్థలు, స్వతంత్ర డెవలపర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త బిల్లింగ్ విధానంతో నెలవారీ ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని కొందరు డెవలపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, అధికంగా AI ఆధారిత కోడింగ్ చేసే వినియోగదారులకే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. AI సేవల్లో వినియోగ ఆధారిత ధరల విధానం వైపు టెక్ కంపెనీలు అడుగులు వేస్తున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తాజా నిర్ణయం పరిశ్రమలో చర్చనీయాంశమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!