
జనరల్

అర్వింద్ ధర్మపురి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్పై జరుగుతున్న దుష్ప్రచారం, అలాగే అభ్యంతరకర బ్యానర్ల ఏర్పాటు చర్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాజకీయాల్లో సౌమ్య స్వభావం కలిగిన నాయకుడిగా, దశాబ్దాలుగా ప్రజా జీవితంలో సేవలందిస్తున్న ఈటల రాజేందర్పై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు.
అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ తో తనకు విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని అర్వింద్ స్పష్టం చేశారు. తమ మధ్య సోదర భావం తప్ప మరే విభేదాలు లేవని చెప్పారు. రాజకీయాల్లో ప్రజా సమస్యలపై ఆరోగ్యకరమైన చర్చలు, పోటీ ఉండాలని, వ్యక్తిత్వ హననం, దుష్ప్రచారాలకు తావు ఉండకూడదని పేర్కొంటూ, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారు వెంటనే వాటిని నిలిపివేయాలని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!