
.jpg&w=3840&q=75)
దేశంలోనే అతి పెద్ద నగరపాలక సంస్థగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 10 నుంచి మూడు కార్పొరేషన్లుగా విభజించనుంది. ప్రస్తుతం 300 డివిజన్లతో 1.34 కోట్ల జనాభా కలిగిన ఈ మహానగరంలో కార్పొరేటర్ల పదవీకాలం ముగియడంతో, 17 ఏళ్ల తర్వాత ప్రత్యేక అధికారి పాలన అమల్లోకి రానుంది. పాలకమండలి లేకపోయిన సమయంలో మేయర్ హోదాకు సమాన అధికారాలతో ప్రత్యేక అధికారులను నియమించి పరిపాలన కొనసాగించనున్నారు.
ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం, ప్రస్తుత జీహెచ్ఎంసీని 70 లక్షల జనాభాతో ఆరు జోన్లకు పరిమితం చేసి, మిగతా ప్రాంతాలను మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) మరియు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)గా ఏర్పాటు చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, ఖైరతాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్ జోన్లు ఉంటాయి. ఎంఎంసీలో మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్, సీఎంసీలో కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఉండనున్నాయి. నగర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే ఈ విభజన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!