

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేపథ్యంలో అహ్మదాబాద్ నగరంలో క్రికెట్ ఉత్సాహం పెరుగుతోంది. భారత్–న్యూజిలాండ్ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడటానికి వేలాది అభిమానులు అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కారణంగా నగరంలోని హోటల్ గదుల ధరలు భారీగా పెరిగాయి. సాధారణంగా ఉండే ధరలతో పోలిస్తే 300 నుంచి 400 శాతం వరకు పెరుగుదల నమోదైంది. కొన్ని లగ్జరీ హోటళ్లలో ఒక్క రాత్రి గది ధర లక్ష రూపాయల వరకు చేరినట్లు సమాచారం. తజ్ స్కై హోటల్లో అయితే గది ధర రెండు లక్షలకు పైగా పెరిగినట్లు తెలుస్తోంది.
విమాన టికెట్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ముంబై, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు సాధారణంగా సుమారు 3 వేల రూపాయలుగా ఉండే టికెట్ ధరలు ప్రస్తుతం 15 వేల నుంచి 17 వేల రూపాయల వరకు చేరాయి.
అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పశ్చిమ రైల్వే ముంబై బాంద్రా నుంచి అహ్మదాబాద్కు ప్రత్యేక రైలు కూడా ఏర్పాటు చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!