
సినిమాలు

నరేంద్ర మోదీ కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఈ సాయం ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి అందజేస్తున్నట్లు తెలిపారు.
కర్ణాటక నుంచి శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం దర్శనానికి వెళ్తున్న భక్తుల బొలెరో వాహనం ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించి, అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సిరి బాధితులను పరామర్శించి, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.



.jpeg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!