
రాజకీయాలు

గత ఆర్థిక సంవత్సరం (2025–26) నాలుగో త్రైమాసికానికి (క్యూ4) హెచ్సీఎల్టెక్ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 4.20 శాతం పెరిగి ₹4,488 కోట్లకు చేరుకుంది. ముఖ్యంగా ఏఐ ఆధారిత సేవల్లో బలమైన పనితీరు ఈ వృద్ధికి దోహదపడింది. గత ఆర్థిక సంవత్సరం (2024–25) ఇదే కాలంలో కంపెనీ లాభం ₹4,307 కోట్లుగా నమోదైంది.
క్యూ4లో కంపెనీ ఆదాయం 12.34 శాతం పెరిగి ₹33,981 కోట్లకు చేరుకుంది, గత ఏడాది ఇదే కాలంలో అది ₹30,246 కోట్లుగా ఉంది. మూడో త్రైమాసికం (క్యూ3)తో పోలిస్తే, లాభం 10.10 శాతం, ఆదాయం 0.32 శాతం పెరిగింది. కంపెనీ తన షేర్హోల్డర్లకు ఒక్కో షేరుకు ₹24 డివిడెండ్ను ప్రకటించింది. రికార్డు తేదీగా ఈ నెల 25ను నిర్ణయించగా, వచ్చే నెల 5న డివిడెండ్ చెల్లించనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!