

రఘు కుంచె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గేదెల రాజు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ చిత్రాన్ని చైతన్య మోటూరి దర్శకత్వంలో, వాణి రవికుమార్ మోటూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24 న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, వీఎన్ ఆదిత్య, రచయిత-నిర్మాత కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి స్పందన పొందాయి. కాకినాడ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఒక రౌడీ పాత్ర చుట్టూ తిరిగే కథతో ఆకట్టుకోనుంది.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కంటెంట్ బలంగా ఉంటే సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని తెలిపారు. రఘు కుంచె చేసిన కృషిని ప్రశంసిస్తూ, ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆశించారు. చివరి 20 నిమిషాల్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని చిత్రబృందం తెలిపింది. మాస్, ఎమోషన్, మిస్టరీ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. విస్తృతంగా స్క్రీన్స్లో విడుదల కానున్న ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!