

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని బండి సంజయ్ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం, వారిపై ఒత్తిడి తీసుకురావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు.
ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని బీజేపీ నిర్ణయించిందని ఎన్ రామచంద్రరావు తెలిపారు. ఈ నేపథ్యంలో నర్సంపేటలో జరిగే శంకర్ గౌడ్ అంత్యక్రియలకు బీజేపీ తరఫున బండి సంజయ్ హాజరవుతారని వెల్లడించారు. అలాగే ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!