

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు బ్రోకరేజ్ సంస్థలను కలవరపెడుతున్నాయి. యుద్ధం త్వరగా ముగియకపోతే ముడి చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని కోటక్ సెక్యూరిటీస్ హెచ్చరించింది. ప్రస్తుతం బ్రెంట్ రకం ముడి చమురు ధర బ్యారెల్కు 109 నుంచి 110 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతుండగా, ఈ నెలాఖరులోగా 130 నుంచి 140 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని కమోడిటీస్ అండ్ కరెన్సీ విభాగం రీసెర్చ్ హెడ్ అనింద్య బెనర్జీ తెలిపారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ముప్పు కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు.
ధరల పెరుగుదల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతాన్ని మించే అవకాశం ఉందని, జీడీపీ వృద్ధి రేటు 6 శాతం దిగువకు పడిపోవచ్చని తెలిపారు. ఫ్యూచర్స్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఇప్పటికే 20 నుంచి 30 డాలర్ల ప్రీమియంతో ట్రేడ్ అవుతోందని ఆయన గుర్తుచేశారు. హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగినంతకాలం రూపాయి పతనం కూడా కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!