

డీలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టడం వల్లే లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిందని కేటీఆర్ అన్నారు. మహిళా రిజర్వేషన్లకు ఇతర పార్టీలు సానుకూలంగా ఉన్నప్పటికీ, బీజేపీ రాజకీయ కారణాల వల్లే బిల్లు ఆమోదం పొందలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ సీట్లతోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని ఆయన పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో బీజేపీ ఆడిన రాజకీయ నాటకాన్ని దేశ ప్రజలందరూ గమనించారని తెలిపారు.
ఇప్పటికైనా డీలిమిటేషన్తో సంబంధం లేకుండా మహిళలకు రిజర్వేషన్లు కల్పించేలా కొత్త బిల్లు తీసుకురావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రయోజనాల కోసం మహిళలను ఉపయోగించుకుని, వారిని వెన్నుపోటు పొడిచిన పార్టీగా బీజేపీ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. మహిళా సాధికారత పేరుతో జరిగిన ఈ పరిణామాలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.




















.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!