
బిజినెస్

భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేసినట్లు వెల్లడించారు. ఉగ్ర సంస్థలకు అనుకూలంగా కంటెంట్ పోస్టు చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు నకిలీ ఆధార్ కార్డులతో తమిళనాడులోని తిరుప్పూర్ గార్మెంట్స్ పరిశ్రమల్లో పనిచేస్తూ గోప్యంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. సోషల్ మీడియా వేదికల ద్వారా అనుమానాస్పద కంటెంట్ను పోస్టు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీరు కేవలం ప్రచార కంటెంట్ మాత్రమే కాకుండా పేలుళ్లకు సంబంధించిన కుట్రలో కూడా భాగస్వాములయ్యారని ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.
పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇతర సంబంధిత వ్యక్తులు ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!