

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 243/2024 కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.టి. రామారావు గారికి నోటీసులు జారీ చేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు.
విచారణ సందర్భంగా కేసుకు సంబంధించిన కీలక అంశాలపై ప్రశ్నలు వేసి, రికార్డులో ఉన్న ఆధారాలతో వాటిని విశ్లేషించినట్లు సిట్ తెలిపింది. అలాగే, సాక్షులను సంప్రదించవద్దని లేదా ప్రభావితం చేయవద్దని కెటీఆర్కు సూచించింది. అవసరమైతే మళ్లీ విచారణకు పిలవవచ్చని కూడా తెలియజేసింది.
ఈ విచారణ కేవలం క్రైమ్ నంబర్ 243/2024 కేసుకు మాత్రమే సంబంధించినదని సిట్ స్పష్టం చేసింది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు సహా వేలాది మంది పౌరుల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. దర్యాప్తు పూర్తిగా చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా కొనసాగుతుందని, నిరాధారమైన సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ప్రజలకు సిట్ విజ్ఞప్తి చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!