

ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ‘ఐస్ ఆన్ స్టార్స్, ఫీట్ ఆన్ ది గ్రౌండ్’ అనే అంశంపై ప్రసంగించారు. అంతరిక్షయానం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆమె పేర్కొన్నారు. అంతరిక్షం నుంచి భూమిని చూసినప్పుడు జీవితం పట్ల తన ఆలోచన విధానం మారిపోయిందని, మనుషులు చిన్న చిన్న విషయాలపై గొడవలు పడటం చాలా అర్థరహితంగా అనిపిస్తుందని తెలిపారు.
అంతరిక్షానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ముందుగా తమ ఇల్లు ఎక్కడుందో చూడాలని ప్రయత్నిస్తారని సునీతా విలియమ్స్ చెప్పారు. తన తండ్రి భారత్కు చెందినవారు, తల్లి స్లోవేనియాకు చెందినవారు కావడంతో మొదట ఆ ప్రాంతాలనే వెతికానని తెలిపారు. అయితే చివరికి భూమి మొత్తం ఒక్కటేనని అర్థమైందన్నారు. సముద్రాలు, ఋతువులు, ధృవ ప్రాంతాలు అంతరిక్షం నుంచి ఎంతో అద్భుతంగా కనిపిస్తాయని, అవన్నీ మనలో ఐక్యత భావనను పెంచుతాయని చెప్పారు. దాదాపు 30 సంవత్సరాలు నాసాలో సేవలందించిన ఆమె మూడు సార్లు అంతరిక్షయానం చేసి, మొత్తం 608 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!