
రాజకీయాలు

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీ నాయకత్వానికి ఐదు పేజీల రాజీనామా లేఖ సమర్పించినట్లు సమాచారం. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిసిన అనంతరం అన్నామలై తన నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేసినట్లు వార్తలు వెలువడ్డాయి.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, రాజీనామా లేఖ సమర్పించినప్పటికీ దానిపై తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. బీజేపీ అధిష్ఠానం రాజీనామాను వెంటనే ఆమోదించలేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అన్నామలై భవిష్యత్ రాజకీయ అడుగులు ఏమిటన్న అంశంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!