
జనరల్

సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయిన్ పల్లి ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనం రెండో అంతస్తులోని గదిలో నుంచి మంటలు వెలువడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. గదిలో ఉన్న సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు వేడెక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం చెబుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!