
రాజకీయాలు

CRISIL విడుదల చేసిన తాజా నివేదిక సామాన్యులపై ద్రవ్యోల్బణ భారం మరింత పెరిగే అవకాశాలను సూచిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా రవాణా ఖర్చులు అధికమవుతాయని, దాని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. దీంతో ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య వినియోగదారులపై అదనపు భారం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
దేశంలో సుమారు 71 శాతం వస్తువుల రవాణా రోడ్డు మార్గంలోనే జరుగుతుండటంతో రోడ్డు రవాణా రంగంపైనే అత్యధిక ప్రభావం ఉంటుందని క్రిసిల్ అంచనా వేసింది. రవాణా వ్యయాలు పెరగడం వల్ల సరుకు రవాణా ఖర్చులు అధికమై, చివరికి వస్తువుల ధరల్లో ప్రతిఫలించే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఆర్బీఐ ద్రవ్యోల్బణ పరిస్థితులతో పాటు ఎల్నినో ప్రభావాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!