
జనరల్

కోల్కతాలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సికి ఏర్పాటు చేసిన 70 అడుగుల భారీ విగ్రహాన్ని అధికారులు తొలగిస్తున్నారు. కేవలం ఆరు నెలల క్రితమే ఘనంగా ఆవిష్కరించిన ఈ విగ్రహం బలమైన గాలుల సమయంలో ప్రమాదకరంగా ఊగిపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సోమవారం నుంచి భారీ యంత్రాల సహాయంతో తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి.
ప్రజల ఫిర్యాదుల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో విగ్రహ నిర్మాణంలో పలు లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పునాది సరిగా లేకపోవడం, అమరికలు బలహీనంగా ఉండటం వంటి కారణాలతో వర్షాకాలంలో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. అర్జెంటీనా ప్రపంచకప్ విజయానికి గుర్తుగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఆరు నెలలకే తొలగించబడటం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!