

ప్రముఖ ట్రావెల్ టెక్నాలజీ సంస్థ ఓయో (OYO) మాతృసంస్థ ప్రిజమ్కు (Prism) ఐపీఓ నిర్వహణ కోసం భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) ఆమోదం తెలిపింది. కంపెనీ మార్కెట్ నుంచి సుమారు రూ.6,650 కోట్లు సమీకరించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఐపీఓ సుమారు 7 నుంచి 8 బిలియన్ డాలర్ల విలువ వద్ద మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఐపీఓ ప్రక్రియలో భాగంగా ప్రిజమ్ సంస్థ 2025 డిసెంబర్లో కాన్ఫిడెన్షియల్ రూట్ ద్వారా ముసాయిదా ఐపీఓ పత్రాలను సెబీకి సమర్పించింది. తాజాగా సెబీ నుంచి అనుమతి లభించడంతో, కంపెనీ ఇప్పుడు పబ్లిక్ అప్డేటెడ్ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (UDRHP-1)ను సమర్పించాల్సి ఉంది. జూలై నెలలో ఈ పత్రాలను దాఖలు చేయాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. మార్కెట్ పరిస్థితులు మరియు లిస్టింగ్ షెడ్యూల్ను బట్టి ఐపీఓ ప్రారంభ తేదీ ఖరారయ్యే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!