

ఎన్విడియా వినియోగదారుల ల్యాప్టాప్ ప్రాసెసర్ మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టింది. Computex 2026 వేదికగా సంస్థ తన కొత్త RTX Spark ఏఐ ప్లాట్ఫారమ్ను ఆవిష్కరించింది. గ్రాఫిక్స్ కార్డ్ వ్యాపారానికి మించి విస్తరణలో భాగంగా రూపొందించిన ఈ Arm ఆధారిత సూపర్చిప్, తదుపరి తరం ఏఐ ల్యాప్టాప్లకు శక్తినందించనుంది. మైక్రోసాఫ్ట్ , ఆసుస్ , డెల్ , హెచ్పీ , లెనోవో వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ఈ చిప్తో ల్యాప్టాప్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
RTX Spark ఫ్లాగ్షిప్ వెర్షన్లో 20 CPU కోర్లు, 6,144 GPU కోర్లు, గరిష్టంగా 128GB LPDDR5X మెమరీ ఉండనుంది. అధిక పనితీరు, దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్, అల్ట్రా-స్లిమ్ డిజైన్లతో ఈ పరికరాలు ఏఐ కంప్యూటింగ్కు కొత్త ప్రమాణాలు సృష్టించనున్నాయి. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్, ఆసుస్ ప్రోఆర్ట్ సిరీస్, ఎంఎస్ఐ ప్రెస్టీజ్ ఎన్16 ఫ్లిప్ ఏఐ ప్లస్, డెల్ ఎక్స్పీఎస్ 16 హెచ్పీ ఓమ్నీబుక్ మరియు లెనోవో యోగా మోడళ్లు ఈ ప్లాట్ఫారమ్తో మార్కెట్లోకి రానున్నాయి. దీంతో ఏఐ ఆధారిత పీసీ మార్కెట్లో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!