
గాసిప్స్

తిరుపతి గోవిందస్వామి ఆలయంలో భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలోని ఈ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తి అక్రమంగా ప్రవేశించడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఆలయ గోడ దూకి లోపలికి వచ్చిన ఆ వ్యక్తి ఆలయ గోపురం ఎక్కిన ఘటన భక్తుల్లో కలకలం రేపింది.
మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్న ఆ వ్యక్తి గోపురం పైకి ఎక్కి కలశాలను లాగేందుకు ప్రయత్నించాడని అధికారులు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది సుమారు మూడు గంటల పాటు ప్రయత్నించి అతడిని కిందకు దింపారు. ఈ ఘటనలో ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఘటనపై విచారణ ప్రారంభించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!