

తెలంగాణ పర్యటనలో ఉన్న ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ మోహన్ భగవత్ శనివారం హైదరాబాద్లో టాలీవుడ్ అగ్ర ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ అరుదైన భేటీకి ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ నివాసం వేదికైంది. ఈ సమావేశంలో విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున, నాని, రానా దగ్గుబాటి, వరుణ్ తేజ్, రామ్ పోతినేని, హను-మాన్ ఫేమ్ తేజ సజ్జా పాల్గొన్నారు. అలాగే ప్రముఖ నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేని (రవి), సాహు గారపాటి తదితరులు కూడా హాజరయ్యారు.
మొదట దీనిని మర్యాదపూర్వక కలయికగా భావించినప్పటికీ, సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సినిమాల ద్వారా ప్రపంచానికి ఎలా తీసుకెళ్లాలనే అంశం, వినోదంతో పాటు దేశభక్తి, సామాజిక బాధ్యతను ప్రతిబింబించే చిత్రాల అవసరంపై మోహన్ భగవత్ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సమాజంపై సినిమాల ప్రభావం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు వర్గాలు తెలిపాయి. రాజకీయ ఉద్దేశ్యాలు లేవని, ఇది పూర్తిగా సాంస్కృతిక, సామాజిక అంశాలపై అవగాహన కోసమే జరిగిన భేటీ అని సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!