
క్రీడలు

పాకిస్థాన్ మరియు అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరుదేశాల సరిహద్దుల్లో భీకర దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. పరస్పరం సరిహద్దు దాటి దాడులు చేస్తున్నారనే ఆరోపణలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పెరుగుతున్న సైనిక చర్యలు ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.
ఈ పరిణామాల మధ్య పాకిస్థాన్ కీలక ప్రకటన చేస్తూ అఫ్గానిస్థాన్పై బహిరంగ యుద్ధం ప్రారంభించినట్లు వెల్లడించింది. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, “మా సహనం ముగిసింది. ఇక మాకు, మీకు మధ్య బహిరంగ యుద్ధమే” అంటూ అఫ్గానిస్థాన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!