
సినిమాలు

భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ ఎం.ఎం. నరవణె రచించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకంపై కొనసాగుతున్న వివాదంపై పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా స్పందించింది. ఈ పుస్తకం పేరుతో సామాజిక మాధ్యమాల్లో కాపీలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇప్పటికే కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెంగ్విన్ సంస్థ కీలక ప్రకటన చేసింది.
నరవణె పుస్తకం ఇప్పటివరకు ఒక్క కాపీ కూడా అధికారికంగా ప్రచురితం కాలేదని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా స్పష్టం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నవి అనధికారిక కాపీలేనని, వాటికి సంస్థకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. ఈ వ్యవహారంపై న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నట్లు కూడా తెలిపింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!