
జనరల్

ఇరాన్పై అమలులో ఉన్న సముద్ర దిగ్బంధనాన్ని ఉల్లంఘించే ప్రయత్నం చేసిన ఓ సరుకు రవాణా నౌకపై అమెరికా సైన్యం క్షిపణి దాడి నిర్వహించింది. గాంబియా జెండాతో ప్రయాణిస్తున్న ఆ నౌక ఇరాన్ నౌకాశ్రయం వైపు వెళ్తుండగా, అమెరికా సైన్యం 20కి పైగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. అయినప్పటికీ నౌక సిబ్బంది స్పందించకపోవడంతో చర్యలకు దిగినట్లు వెల్లడించింది.
మే 29న ఒమన్ గల్ఫ్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. నౌక ఇంజిన్ గదిని లక్ష్యంగా చేసుకుని హెల్ఫైర్ క్షిపణిని ప్రయోగించడంతో నౌక ప్రయాణం నిలిచిపోయిందని తెలిపింది. ఈ దాడిలో గాయాలపై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. ఇరాన్పై అమలులో ఉన్న దిగ్బంధనంలో భాగంగా ఇప్పటివరకు 5 వాణిజ్య నౌకలను నిలిపివేసి, 116 నౌకలను దారి మళ్లించినట్లు అమెరికా వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!