
సినిమాలు

నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ వద్ద అద్దంకి నార్కెట్పల్లి బైపాస్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి పండుగ సెలవులు ముగిసిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ వెళ్ళే ప్రజలు తిరుగు ప్రయాణంలో భారీ వాహన రద్దీని ఎదుర్కొంటున్నారు.
మిర్యాలగూడ నుండి హాలియా దిశగా వాహనాలను మళ్లించడం వలన బైపాస్ పై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. పోలీసులు నెమ్మదిగా కదులుతున్న వాహనాలను క్రమబద్ధీకరిస్తూ, ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు.
అలాగే, చిట్యాల ప్రాంతంలో 3 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి, చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలను చిట్యాల నుండి భువనగిరి దిశగా మళ్లించడం జరిగింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!