
టెక్నాలజీ
హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ టీమ్ ఇండియా క్రికెటర్లకు ఓ అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ల కోసం హైదరాబాద్ వచ్చిన మహ్మద్ షమీ, ఆకాష్ దీప్, అభిమన్యు ఈశ్వరన్, ముఖేష్ వంటి టీమ్ ఇండియా ఆటగాళ్లను తన రెస్టారెంట్కు ఆహ్వానించాడు.
ఈ సందర్భంగా సిరాజ్ స్వయంగా హైదరాబాద్ స్పెషల్ బిర్యానీతో పాటు తన రెస్టారెంట్లోని ప్రత్యేక వంటకాలను వారికి వడ్డించాడు. ఈ విందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అదే సమయంలో వన్డేల్లో భారత బౌలింగ్ దారుణంగా పడిపోవడంతో, వెంటనే మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలా బౌలర్లను తుది జట్టులోకి తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ ఇద్దరు స్టార్ పేసర్లు అద్భుతంగా రాణించడం ఆ డిమాండ్లను మరింత బలపరుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!